తెలంగాణలో అటెండర్ నుంచి ఐఏఎస్ల వరకు 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఓవైపు నిరుద్యోగులకు గ్రూప్1 నుంచి గ్రూప్4 వరకు ఉద్యోగ అవకాశాలు రానుండగా.. మరోవైపు సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కనున్నాయి.