అక్రమంగా చొరబడుతోన్న ఏడుగురు ఉగ్రవాదులు అరెస్ట్

కరోనా విపరీతంగా విజృంభిస్తున్నప్పటికీ… ఉగ్రవాదుల ఆగడాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారు. జమ్మూలోని నౌషెరా సెక్టార్‌ వద్ద నుంచి దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి.

అదే విధంగా పట్టుబడ్డ ఉగ్రవాదుల నుంచి రెండు ఏకే-47, పిస్తోల్‌, గ్రనేడ్లు, పాకిస్థాన్‌ ముద్రలున్న వస్తువులతో పాటు భారీమొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. ఉగ్రవాదులను పట్టుకోవడానికి నాలుగు రోజులుగా ఆపరేషన్‌ కొనసాగిస్తున్నామని నాగ్రోటా కార్ప్స్‌ అధికారులు ప్రకటించారు. గత నెల 28న నియంత్రణా రేఖ వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా ఒకరికి గాయాలయ్యాయి. ఇలా ఉగ్రవాదులు సరిహద్దుల వద్ద నుంచి దేశంలోకి ప్రవేశించడం ఎక్కవగా ఉండటంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.