అసలేం జరిగింది అంటే.. అభంగాపురం గ్రామానికి చెందిన బోయ వెంకటయ్య కుమారుడు ప్రశాంత్ ఇదే గ్రామానికి చెందిన బోయ వెంకన్న భార్యతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. దీంతో వెంకన్న దంపతులకు మద్య గొడవ జరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయంపై కక్ష పెంచుకున్న వెంకన్న సోదరుడైన బోయ ప్రసాద్ తన సమీప బంధువైన వెంకటయ్య ఇంట్లోకి అక్రమంగా దూరాడు. వెంకటయ్యతో పాటు ఆయన భార్య సైదమ్మ, కుమార్తె యమున, మనవడు గౌతమ్ నందాలు ఘాడ నిద్రలో ఉన్నారు. అది చూసిన ప్రసాద్.. ఆ కుటుంబం మొత్తంపై పెట్రోల్ పోసి నిప్పటించేశాడు. ఈ ప్రమాదంలో మిగిలిన వారు సురక్షితంగా బయటపడగా గౌతమ్ నందా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. బాలుడి తల్లి యమున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకన్న, శ్రవణ్, ప్రసాద్లపై హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత పోలీసుల దర్యాప్తు మొదలెట్టారు.