చెల్లిపై మోజుతో భార్యను చంపేసి లోయలో పడేశాడు..

Illegal relationship with Pinney .... Babai's murder

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో దారుణం చోటుచేసుకుంది. అక్కతో కాపురం చేస్తూ ఆమె చెల్లెలితో పెళ్లికి రెడీ అయ్యాడు. రెండో పెళ్లికి భార్య నిరాకరించడంతో దారుణానికి పాల్పడ్డాడు. మరదలిపై మోజుతో కట్టుకున్న భార్యని అతి కిరాతకంగా చంపేశాడు. ఈ దారుణమైన ఘటన కర్నూలులో కలకలం రేపుతోంది. బేతంచెర్ల మండలం గోరుమానుకొండ తండాకు చెందిన సుశీలాబాయికి అలేబాదుతండాకి చెందిన రవి నాయక్‌తో పెళ్లైంది. వారికి ఒక పాప కూడా ఉంది. కొంతకాలంగా భార్య చెల్లెలిని రెండో పెళ్లి చేసుకుంటానంటూ చెప్తున్నాడు. అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ప్లాన్ వేశాడు.

అందుకోసం భార్యను అడ్డుతొలగిస్తే మరదలిని పెళ్లి చేసుకోవచ్చని గ్రహించాడు. దీంతో ఆమెని నమ్మకంగా తీసుకెళ్లి హతం చేశాడు. గొర్రెలు మేపేందుకు కొండకి వెళ్తున్నానంటూ భార్యని వెంట తీసుకెళ్లి బండరాయితో తలపై మోది అతి కిరాతకంగా చంపేశాడు. ఆమె శవాన్ని లోయలో పడేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి హైడ్రామాకు తెరతీశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ కొత్త నాటకం స్టార్ట్ చేశాడు. అదే విషయాన్ని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పడంతో వారు రాత్రికి రాత్రే గ్రామానికి చేరుకుని వెతకడం ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం లోయలో మహిళ మృతదేహాన్ని గమనించిన పశువుల కాపరులు గ్రామస్తులకు విషయం తెలిపారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్య మృతదేహం బయటపడడంతో రవినాయక్ అక్కడి నుంచి పరారు అయ్యాడు. రెండో పెళ్లి కోసం తన కూతురిని అల్లుడే దారుణంగా హత్య చేశాడని అక్కని చంపేశాడంటూ హతురాలి తండ్రి సేవ్యా నాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.