అమ్మతనం విలపించింది… ఏకంగా ఐదుగురు బిడ్డలూ గంగపాలు

కన్న బిడ్డలను కడతేర్చింది ఓ తల్లి. పుట్టిన బిడ్డలను గంగపాలు చేసింది. ఏకంగా ఐాదుగురు పిల్లలను నదిలో తోసేసి చేతులు దులుపేసుకుంది. కసాయి తల్లి చేష్టలు చూసి భయపడిపోయిన స్థానిక జనం అక్కడ నుంచి పారిపోయారంటే నమ్మండి.

అయితే ఇది అమ్మతనానికి నిజంగా మాయని మచ్చనే చెప్పాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలను అమానుషంగా చంపేసింది. ఏకంగా ఐదుగురు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా నీళ్లలోకి వదిలింది. భర్తతో గొడవపడి బయటికొచ్చిన ఓ కసాయి తల్లి.. ఐదుగురు పిల్లలను నదిలో పడేసి అతిక్రూరంగా చంపేసింది. అలా పిల్లలు కొట్టుకుపోతుంటే అక్కడే ఉండి కదలకుండా చూస్తూ నిల్చుండిపోయింది. అది చూసిన స్థానికులు ఆమెను చూసి భయపడిపోయి మంత్రగత్తె అనుకొని పరుగులు తీశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

అదేవిధంగా యూపీలోని బదోహి ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు మృదుల్ యాదవ్, మంజు యాదవ్ మధ్య ఏడాది కాలంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిత్యం గొడవలు జరుగుతుండడంతో భార్య మంజు యాదవ్ అమానుషానికి తెగబడింది. కన్నబిడ్డలు ఐదుగురినీ చంపేయాలని నిర్ణయించుకుంది. గంగలో తోసేసి పిల్లలను చంపేయాలని డిసైడ్ అయింది. దాంతో వారిని తీసుకొని గంగా నది ఒడ్డుకు చేరుకుంది. జహంగీరాబాద్ వద్ద గంగా నది ఘాట్‌కి చేరుకున్న మంజు యాదవ్.

ఏమాత్రం ఆలోచించకుండా ఐదుగురు బిడ్డలు ఆర్తి, సరస్వతి, మాతేశ్వరి, శివ్‌శంకర్, కేశవ్ ప్రసాద్‌లను గంగలోకి తోసేసింది. ఐదుగురు చిన్నారులు నీళ్లలో మునిగిపోతూ కేకలు పెడుతున్నా ఏమాత్రం కనికరం అనేదే లేకుండా నిల్చొని చూస్తుండిపోయింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు.