కేంద్రం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ

కరోనా ప్రభావం దేశమంతా లాక్ డౌన్ లోకి వెళ్లింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి ఉచితంగానే ఎల్‌పీజీ సిలిండర్లు అందిస్తుంది. 3 సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు.

కరోనా వైరస్ దెబ్బకి దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉండటంతో అంతా ఇంట్లో ఖాళీగా ఉన్న గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవడం ప్రారంభించేశారు. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ డిమాండ్ బాగా పెరిగింది. దీంతో కొంత మందిలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే చాలా రోజులకు రావొచ్చనే ఆందోళనలు ఉండవచ్చని.. అలాంటి ఆందోళన చెందాలసిన అవసరం లేదని తెలిపింది.

అదేమంటే… ప్రభుత్వం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) తాజాగా అదనపు ఎల్‌పీజీ దిగుమతుల కోసం ఓ డీల్ కుదుర్చుకుంది. ఏప్రిల్, మే నెలల్లో కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చూసుకోవడం కోసం కంపెనీ ఓ నిర్ణయం తీసుకుంది. దీంతో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేవారు ఎన్ని రోజులకు సిలిండర్ వస్తుందోనని ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఎల్‌పీజీ గ్యాస్‌కు సంబంధించి సాధారణ దిగుమతుల కన్నా ఏప్రిల్, మే నెలల్లో 50 శాతం ఎక్కువగా దిగుమతి చేసుకుంటామని ఐఓసీ స్పష్టం చేసింది. అలాగే కీలకమైన రిఫైనరీస్‌లో కూడా పూర్తి స్థాయిలో ఎల్‌పీజీని ఉత్పత్తి చేస్తామని పేర్కొంది. అదనపు పని గంటలు, హాలిడేస్‌లో కూడా ఉత్పత్తి కొనసాగిస్తాని తేల్చి చెప్పింది. కాగా ఐఓసీ గత 15రోజుల్లో ఏకంగా 3.38 కోట్ల ఎల్‌పీజీ సిలిండర్లను డెలివరీ చేసిందని.. అంటే రోజుకు 26 లక్షల సిలిండర్లు డెలివరీ అయ్యాయని వివరించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వపు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY) స్కీమ్ కింద పేదలకు ఉచితంగా 3 సిలిండర్లు అందజేస్తున్నామని కూడా వెల్లడించింది.