నోటీసులు తీసుకున్న వారంతా దోషులు కాకపోవచ్చు

All The Tollywood Persons Drugs Ane Not Accused In Drugs Rocked Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా అనుమానం ఉన్న వారందరికి నోలీసులు ఇచ్చినట్లుగా పోలీస్‌ ఉన్నతాధికారి అకున్‌ సబర్వాల్‌ అన్నారు. ఇటీవల పట్టుబడిన వారి కాల్‌ డేటా మరియు వారిని విచారించిన తర్వాత టాలీవుడ్‌లో పలువురికి వారితో సంబంధం ఉందని వెళ్లడైంది. ఆ కారణంగానే వారందరికి నోటీసులు ఇచ్చినట్లుగా ఆయన పేర్కొన్నాడు. నోటీసులు అందుకున్న వారు అంతా కూడా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లుగా భావించనక్కర్లేదని, కాల్‌ డేటాలో వారి పేర్లు లభించాయి కనుక నోటీసులు ఇచ్చాం. వారిని ఈనెల 19న విచారించడం జరుగుతుంది. ఆ విచారణ తర్వాత వారికి పరీక్షలు కూడా జరిపే అవకాశం ఉంది. అప్పుడు అసలు దోషులు ఎవరు అనే విషయం తేలే అవకాశం ఉంది. డ్రగ్స్‌ తీసుకునే వారి జాబితాలో ఉన్న గీతా మాధురి భర్త నందు నిర్ధోషి అయ్యి ఉంటాడు అనే చర్చ జరుగుతుంది. ఇతరుల సంగతి మాత్రం అనుమానంగా ఉంది. పలువురు డ్రగ్స్‌ తీసుకోకున్నా డ్రగ్స్‌ అమ్మకంలో పాలు పంచుకుని ఉంటారు అనే చర్చ జరుగుతుంది. మొత్తానికి నోటీసులు అందుకున్న వారిలో మంచి వారు ఎందరు, చెడిపోయిన వారు ఎవరు, చెడిపేసిన వారు ఎందరు అనే విషయం తేలే అవకాశం ఉందని పోలీసు వర్గాల వారు చెబుతున్నారు. సినీ పరిశ్రమ పెద్దలు మాత్రం వారిపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. విచారణలో డ్రగ్స్‌ తీసుకున్నట్లుగా వెళ్లడి అయితే వారిని బ్యాన్‌ చేసే విషయమై కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 మరిన్ని వార్తలు:

పటేల్ సర్…తెలుగు బులెట్ రివ్యూ.

నవదీప్ కోసం ఐదుగురు హీరోలు రంగప్రవేశం