అల్లు అర్జున్‌ అంచనాలు పెంచుతున్నాడు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం విడుదలకు అంతా సిద్దం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఆడియోకు మంచి స్పందన వస్తుంది. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ను నేడు విడుదల చేయడం జరిగింది. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుంటుందనే నమ్మకంను ట్రైలర్‌ కలిగిస్తుంది. ఆర్మీ నేపథ్యంలో సినిమా అంటే మొత్తం సైన్యం, యుద్దాలు ఉంటాయని భావిస్తారు. కాని ఇందులో దేశ భక్తితో పాటు పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలు కూడా ఉన్నట్లుగా ట్రైలర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. తప్పకుండా అల్లు అర్జున్‌కు ఈ చిత్రం ఒక భారీ బ్లాక్‌ బస్టర్‌ అవుతుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. 

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ చాలా విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తున్నాడు. దాంతో మెగా ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. లగడపాట శ్రీధర్‌ మరియు నాగబాబులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్‌, అను ఎమాన్యూల్‌ల జంటకు మంచి మార్కులు పడుతున్నాయి. ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అవుతుందనే నమ్మకంను ట్రైలర్‌ చూసిన తర్వాత విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నా పేరు సూర్య చిత్రం ఒక మంచి సినిమా అవుతుందనిపిస్తుంది. ‘రంగస్థలం’, ‘భరత్‌ అనే నేను’ చిత్రా దారిలోనే ఈ చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఆ చిత్రాల స్థాయిలో వసూళ్లు చేస్తుందా అనేది చూడాలి.