అడివి శేష్‌తో అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్….

అడివి శేష్‌తో అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్....
Cinema News

సుహాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ ఫిబ్రవరి 2, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లోకి రానుంది. ఈ మూవీ తో తెలుగు తెరకు పరిచయం అవుతోంది హీరోయిన్ శివాని నాగరం. ఈ మూవీ ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ కు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ మూవీ కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు సాయంత్రం 6:30 గంటలకి అవస హోటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్ లో జరగనుంది. ఈ ఈవెంట్ కి టాలెంటెడ్ నటుడు అడివి శేష్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు . ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ప్రచార సినిమా ల తో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.