21 మంది విద్యార్థుల్ని వెనక్కి పంపిన అమెరికా.. వారిలో తెలుగు వారే ఎక్కువ.

America
America

భారతీయ విద్యార్థులు 21 మంది అమెరికాకు వెళ్లిన అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. అమెరికా ఇమిగ్రేషన్‌ అధికారులు గురువారం రోజున వివిధ వర్సిటీల్లోని కోర్సుల్లో చేరేందుకు వెళ్లిన వారిని అట్లాంటా, శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో ఎయిర్‌పోర్ట్‌ల నుంచి రిటర్న్‌ ఫ్లైట్‌లు ఎక్కించారు. వివిధ పత్రాలు సక్రమంగా లేకపోవడం వంటి కారణాలను చూపారు.

అయితే ఇలా వెనక్కి పంపించిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఉండటం ఎక్కువ మంది ఉండటం గమనార్హం. విమానాశ్రయాలకు చేరుకున్నాక సాధారణ తనిఖీల్లో భాగంగా మిగ్రేషన్‌ అధికారులు కొంతమందిపై అనుమానంతో ఆరా తీశారు. ప్రవేశాలు దక్కిన వర్సిటీలో ఫీజులు, విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిశీలించారు. ఫోన్లు, మెయిళ్లు, కన్సల్టెన్సీలు, అమెరికాలోని విద్యార్థులతో సంభాషణలను లోతుగా పరిశీలించిన అధికారులు వారిని తిప్పి పంపినట్లు తెలుస్తోంది.ఒకసారి అమెరికా నుంచి డిపోర్ట్‌ అయిన విద్యార్థులు తిరిగి 5 ఏళ్ల దాకా ఆ దేశ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు అవుతారు. వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.