Bigg Boss : హౌస్‌లో యావర్‌కు ఎమోషనల్ సర్‌‌‌ప్రైజ్

బిగ్ బాస్ 7: శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ - టైటిల్ విజేత ఎవరు?
Cinema News, Entertainment

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమ ఫ్యామిలీ మెంబర్స్ ను చూసిన హౌస్ మేట్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇప్పటికే శివాజీ కొడుకు, అర్జున్ భార్య, గౌతమ్ మదర్, ప్రియాంక బాయ్ ఫ్రెండ్, భోలే సతీమణి, అశ్విని తల్లి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సర్ ప్రెస్ కూడా చేశారు. ఇక నేటి ఎపిసోడ్ లో కూడా కొంతమంది హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీ ఇచ్చారు. ముందుగా అమర్ దీప్ ను ఆటపట్టించారు బిగ్ బాస్. అమర్ దీప్ ను కన్సెషన్ రూమ్ కు పిలిచాడు బిగ్ బాస్. అమర్ దీప్ ముందు ఒక కేక్ పెట్టి హ్యాపీ బర్త్ డే చెప్పాడు బిగ్ బాస్. తన భార్య తేజస్విని ఆ కేక్ ను పంపించారని చెప్పాడు బిగ్ బాస్ ఆమెకు రావడం కుదరలేదు అని చెప్పారు . దాంతో కాస్త నిరాశ పడ్డాడు అమర్.

కానీ ఇంతలో హౌస్ లోకి అమర్ డీప్ భార్యను పంపించారు. బయటకు వచ్చిన అమర్ తేజు రాలేదు. కేక్ పంపించింది అని చెప్పారు కానీ హౌస్ లో భార్యను చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు.ఆతర్వాత ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు . తాజాగా విడుదలైన ప్రోమోలో శోభా శెట్టికి సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్.

Video : https://youtu.be/6hlT85Bytig

శోభా శెట్టి అమ్మగారు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూడగానే ఆనందంతో కేకలు వేసింది శోభా శెట్టి. తల్లిని చూసి కన్నీళ్లు పట్టుకుంది శోభా తల్లి హౌస్ లో ఉన్న అందరిని కౌగిలించుకుని తన ప్రేమను చూపించారు. యావర్ కు గిఫ్ట్ ఇచ్చి అతడిని ఎమోషనల్ అయ్యేలా చేశారు. యావర్ ను కౌగిలించుకొని నేను మీ అమ్మలానే నువ్వు నాకు కొడుకువే అని అంటూ యావర్ అమ్మ ఫోటోను ఇచ్చారు శోభా తల్లి దాంతో ఎమోషనల్ అయిన యావర్ ఆమె కాళ్ళ మీద పడ్డాడు. ఆతర్వాత కూతురితో ముచ్చట్లు పెట్టారు . నీ కోపం నాకు తెలుసు నీకు తెలుసు వీళ్లకు తెలియదు కదా..! ఏడవకు అని అంటూ దైర్యం చెప్పారు శోభా తల్లి..