జ‌గ‌న్ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవ‌డం మంచిది

anantapur-mp-jc-diwakar-reddy-sensational-comments-on-jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా వైసీపీ అధినేత జ‌గ‌న్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించే అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి మ‌రోమారు త‌న నోటికి ప‌నిచెప్పారు. జ‌గ‌న్ త‌న జీవితంలో ఎప్పుడూ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశ‌మే లేద‌ని జేసీ జోస్యం చెప్పారు. పాద‌యాత్ర కోసం జ‌గ‌న్ స‌న్నద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో జేసీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అక్ర‌మాస్తుల కేసులో ప్ర‌తి శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రవ్వాల్సిన జ‌గ‌న్ ఇక పాదయాత్ర ఎలా చేస్తార‌ని జేసీ ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటేనే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. జ‌గ‌న్ ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్న న‌వ‌రత్న హామీల‌పైనా.. జేసీ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌వ‌ర‌త్నాలు లేవు…నాప‌రాళ్లు లేవు అంటూ వ్యాఖ్యానించారు. అనంత‌పురం జిల్లా స‌మ‌స్య‌ల్ని తీర్చుతాన‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట ఇచ్చార‌ని, అందుకే త‌న రాజీనామా నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నానని జేసీ చెప్పారు. 2019లో కూడా టీడీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆయ‌న విశ్వాసం వ్య‌క్తంచేశారు.