తీవ్రమైన ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని

తీవ్రమైన ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి రాజధాని అంశం తీవ్రమైన ఉత్కంఠ ని రేకెత్తిస్తుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విషయంలో ఎప్పుడు, ఎవరు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనేది ఎవరి అర్థం కానీ విషయంలా మారిపోయిందని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో గురువారం నాడు అమరావతి ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, కొందరు వైసీపీ నేతలు ఒక సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా తాడేపల్లిలోని రాష్ట్ర వైసీపీ పార్టీ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 03.30 గంటల సమయానికి వైసీపీ పార్టీ కి చెందిన కొందరు కీలకమైన నేతలు భేటీ నిర్వహించనున్నారు.

అయితే రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటు, రైతుల ఆందోళనలు, రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి ప్రణాళికలపై అందరు కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇకపోతే రాజధాని ప్రాంతంలోని రైతులందరికీ కూడా వారి వారి సందేహాల్ని తీర్చేసి, రైతులందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి వైసీపీ నేతలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పుకొస్తున్నారు. కాగా, ఈ నేపథ్యంలో డిసెంబరు 27న ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశం కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి.