హరికృష్ణ ను చూసి బోరున విలపించిన చంద్రదాబు…!

AP CM Chandrababu Naidu Arrived At Kamineni Hospital

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నార్కట్‌పల్లి లోని కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి హరికృష్ణ మృతి వార్త తెలియగానే తన కుమారుడు మంత్రి నారా లోకేష్ తో కలిసి హెలికాప్టర్‌లో బయలుదేరి వచ్చిన చంద్రబాబును హెలిప్యాడ్ వద్ద వేచి ఉన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి కలుసుకుని కామినేని ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. హరికృష్ణ భౌతికకాయం చూసిన చంద్రబాబు, లోకేశ్‌ భోరున విలపించారు. ప్రమాదం గురించి సమాచారం తెలియగానే ఆయన తనయులు ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ కామినేని ఆసుపత్రికి చేరుకున్నారు.

cm-crying12

ఆ తర్వాత హరికృష్ణ సోదరుడు బాలకృష్ణ, సోదరి పురందరేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, సినీనటుడు జగపతిబాబు, తదితరులు ఆసుపత్రి వద్దకు వచ్చారు. పోస్ట్ మార్టం నిర్వహించేందుకు వైద్యులు సిద్ధమైనప్పటికీ చంద్రబాబు వస్తున్నారన్న సమాచారంతో పోస్ట్ మార్టంను వైద్యులు ప్రారంభించలేదు. కాసేపట్లో పోస్ట్ మార్టంను నిర్వహించనున్నారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఈరోజు సాయంత్రం ఆయన అంత్య క్రియలు మొయినా బాద్ ఫాం హౌస్ లో జరిగే అవకాసం ఉంది. భద్రతాకారణాల రీత్యా అభిమానులెవరినీ పోలీసులు ఆసుపత్రి లోనికి అనుమతించట్లేదు.

cm12345