ఏపీ సీఎం జగన్ మాజీ మంత్రి సురేష్‌ప్రభుతో భేటీ

ఏపీ సీఎం జగన్ మాజీ మంత్రి సురేష్‌ప్రభుతో భేటీ

ఏపీ సీఎం జగన్ తాజాగా కేంద్ర మాజీ మంత్రి సురేష్‌ప్రభుతో భేటీ అయ్యారు. గత కొద్ది రోజులుగా రాజధానిపై ఏర్పడిన గందరగోళ పరిస్థితులు, మూడు రాజధానుల ప్రతిపాదన అంశంపై చర్చలు జరిపేందుకు నేడు కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్ దానిని త్వరగా పూర్తి చేసుకుని మరీ సురేష్‌ప్రభువును కలిశారు.అయితే దాదాపు గంట సేపు సురేష్‌ ప్రభువుతో సమావేశమయిన సీఎం జగన్ రాష్ట్ర రాజకీయాలు, సంక్షేమ పథకాలపై చర్చంచారు. అనంతరం ఆయనతో కలిసి లంచ్‌ చేశారు. అయితే ప్రధాని మోదీకి సురేష్‌ప్రభుకు మంచి సన్నిహిత్యం ఉండడం, సీఎం జగన్ ఆయనతో భేటీ కావడంతో ఏపీ ఈ రాజకీయాలలో ఈ విషయం పెద్ద చర్చానీయాంశంగా మారింది