జగన్ మోహన్ రెడ్డి గారికి విశాఖలో ఘన స్వాగతం

జగన్ మోహన్ రెడ్డి గారికి విశాఖలో ఘన స్వాగతం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి విశాఖలో ఘన స్వాగతం ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం ఫై జనసేన పార్టీ భీమిలి నియోజక వర్గం నుండి పోటీ చేసిన సందీప్ పంచకర్ల సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయ నాయకుడికి రెండు రకాలుగా స్వాగతం లభిస్తుందని తెలిపారు. ఒకటి డబ్బు ద్వారా అయితే, రెండోది అభిమానం ద్వారా అని తెలిపారు. అయితే జగన్ కి స్వాగతం పలకడానికి వచ్చేది ఎవరో, ఎలానో వివరించారు.

వైజాగ్ లో జగన్ గారికి జనాలు స్వాగతం పలకడానికి రాకపోతే రేషన్ కార్డులు, పెన్షన్, ఇళ్ల కేటాయింపులు ఆపేస్తాం అని బెదిరించి తీసుకెళ్తున్నారని చెపుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే జనసేన పార్టీ ప్రస్తుతం జగన్ నిర్ణయాల ఫై, అమరావతి విషయం ఫై మౌనం వహిస్తున్న విషయం అందరికి తెల్సిందే.