AP Politics : ఈ నెల 26న ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు ప్రారంభం

ఈ నెల 26వ తేదీన ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమం ప్రారంభానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 26న గుంటూరు జిల్లాలో ఆటల పోటీలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమాన్నిగుంటూరు రూరల్ పరిధి లయోలా స్కూల్ గ్రౌండ్ లో సీఎం ప్రారంభిస్తారు. ఈమేరకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లను మొదలుపెట్టింది. కాగా, కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొనసాగనుంది. ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. ఇడుపులపాయ ప్రేయర్‌ హాల్‌లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొననున్నారు సీఎం జగన్.

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు సింహాద్రిపురానికి జగన్ వెళ్లనున్నారు. మండల, ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్, రోడ్డు వైడనింగ్ వంటి పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొని సాయంత్రం తిరిగి ఇడుపులపాయ చేరుకోనున్నారు సీఎం జగన్. ఇక ఇవాళ రాత్రికి ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి బస చేయనున్నారు.