నంద్యాల జిల్లాలో దారుణం..మహిళ కిడ్నాప్, లైంగిక దాడి..

Atrocity in Nandyal district..kidnapping of a woman, sexual assault.
Atrocity in Nandyal district..kidnapping of a woman, sexual assault.

రోజు రోజకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన అవి అమలుకు మాత్రం నోచుకోవడం లేదనే చెప్పాలి. తాజాగా నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా కిడ్నాప్ కావడం కాకుండా లైంగిక దాడి కూడా జరిగిన ఘటన నంద్యాల జిల్లా డోన్ మండలం ఓబుళాపురం మిట్ట వద్ద చోటు చేసుకుంది.

అర్ధరాత్రి డోన్ బస్టాండు నుంచి రైల్వేస్టేషన్ కు బయల్దేరిన ఓ మహిళ కి ఆటోలో మత్తుమందు చల్లి ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని దుండగులు. నేషనల్ హైవే 44 ఓబుళాపురం మిట్ట సమీప కొండ ప్రాంతంలోకి దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు జ్యోతి( 50) అనే మహిళ గా గుర్తించారు. ఆ మహిళ పై లైంగికదాడి చేసి రూ. 2 వేల నగదు, బంగారు ముక్కుపుడక అపహరణ చేశారు. ఈ విషయాన్ని హైవే పెట్రోలింగ్ పోలీసులు గుర్తించి ప్రభుత్వ ఆ మహిళను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మహిళను విచారిస్తున్నారు .