బాలయ్య కూడా రెడీ చేయమన్నాడట!

Balakrishna Is Also Ready To Puri Next Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో గతంలో వచ్చిన చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అయితే అదంతా గతం, ప్రస్తుతం మాత్రం పూరి చాలా చెత్త పరిస్థితుల్లో ఉన్నాడు. ఆయన ఏమాత్రం సక్సెస్‌లను దక్కించుకోలేక పోతున్నాడు. చేస్తున్న ప్రతి సినిమాతో బొక్క బోర్లా పడుతున్నాడు. ఈమద్య చేసిన ‘పైసా వసూళ్‌’ మరియు ‘మెహబూబా’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ముఖ్యంగా తన కొడుకు కోసం ఎంతో కష్టపడి, తన సహజ సిద్ద వైఖరికి భిన్నంగా వెళ్లి తెరకెక్కించిన ‘మెహబూబా’ ఆయన్ను కోలుకోలేని పరిస్థితికి దిగజార్చాయి. నిర్మాతగా కూడా మెహబూబా వల్ల నష్టపోయాడు. ఈ సమయంలో పూరికి మరో సినిమా ఛాన్స్‌ రావడం అసాధ్యం అని భావిస్తున్న సమయంలో వరుసగా రెండు ఆఫర్‌లు ఈయన తలుపు తట్టాయి.

చాలా రోజుల క్రితం పూరి ఒక కథను నాగార్జునకు చెప్పడం జరిగింది. ఆ కథతో సినిమాను చేసేందుకు ఇప్పుడు నాగార్జున గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ మొదలు పెట్టాల్సిందిగా ఆదేశించాడు. ప్రస్తుతం తాను చేస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం పూర్తి అయిన వెంటనే ఆ చిత్రాన్ని చేద్దామంటూ పూరికి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతుంది. ఇక ఇదే సమయంలో బాలయ్య కూడా పూరితో ఒక సినిమా చేస్తానంటూ హామీ ఇచ్చాడట. పైసా వసూల్‌ సమయంలోనే పూరి ఒక స్టోరీ చెప్పాడట. ఆ స్టోరీ పూర్తి చేసి స్క్రిప్ట్‌ రెడీ చేయమని పూరితో బాలయ్య తాజాగా అన్నాడట. త్వరలో చేయబోతున్న బోయపాటి మూవీ, ఆ తర్వాత చేయబోతున్న ఎన్టీఆర్‌ మూవీ తర్వాత పూరి దర్శకత్వంలో బాలయ్య నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. వీరి కాంబోకు నిర్మాత కూడా సెట్‌ అయ్యాడట. మొత్తానికి వరుసగా అట్టర్‌ ఫ్లాప్‌లు వస్తున్నా కూడా పూరికి ఇద్దరు స్టార్‌ హీరోు డేట్లు ఇచ్చేందుకు ముందుకు రావడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.