‘జైసింహా’కు బయ్యర్లు కావాలట…

Balakrishna Jai Simha movie has problems with Distributors

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నందమూరి బాలకృష్ణ, తమిళ దర్శకుడు రవికుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘జైసింహా’. ఈ చిత్రాన్ని సి కళ్యాణ్‌ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అంటున్నాడు. అయితే ప్రేక్షకులు మరియు సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలయ్య లుక్‌ మరియు దర్శకుడి ట్రాక్‌ రికార్డు కారణంగా ఈ సినిమా ఆడుతుందో లేదో అనే అనుమానాలను కొందరు వెళ్లబుచ్చుతున్నారు.

Jai Simha movie has problems

‘జైసింహా’పై అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు కాస్త వెనుకాడుతున్నారు. ఇప్పటికే పలు ఏరియాల్లో ఈ చిత్రాన్ని కాస్త తక్కువ రేటుకు, బలవంతంగా నిర్మాత కట్టబెట్టాడు. కాని నైజాం ఏరియాలో మాత్రం ఈ చిత్రాన్ని కొనేందుకు ఏ ఒక్క ముందుకు రావడం లేదు. అసలు రేటు అడిగేందుకు కూడా బయ్యర్లు ఆసక్తి చూపడం లేదు. విడుదల దగ్గర పడుతున్న సమయంలో ఇంకా బయ్యర్ల కోసం వెదికే పరిస్థితిలో నిర్మాత ఉన్నాడు.

ఇక ఓవర్సీస్‌లో పరిస్థితి కూడా అలాగే ఉంది. బాలయ్య సినిమాను ఓవర్సీస్‌లో విడుదల చేయడం అనుమానమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నైజాం ఏరియాలో దిల్‌రాజుతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేయించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని దిల్‌రాజు మాత్రం నిర్మొహమాటంగా తిరష్కరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తాను చాలా సినిమాలు చేస్తున్నాను, ఆ సినిమాల సందడిలో ఈ సినిమా నా వల్ల కాదు అని నిర్మాతతో అన్నట్లుగా సమాచారం. మొత్తానికి టాలీవుడ్‌ స్టార్‌ హీరో బాలయ్యకే బయ్యర్లు కరువయ్యారు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.