హర్యానా గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి

హర్యానా గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి

హర్యానా రాష్ట్ర గవర్నర్‌గా మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. చంఢీగఢ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. చంఢీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టారు.

గతంలో దత్తాత్రేయ హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్‌గా తొలి నియామకం ఆయనకు అక్కడే ఇచ్చారు. ఇటీవల జరిగిన గవర్నర్ల బదిలీల్లో బండారు దత్తాత్రేయ హర్యానాకు బదిలీ అయ్యారు. హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర అర్లేకర్‌ ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు.