రంభ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. ఆస్తులు పోయాయి

రంభ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. ఆస్తులు పోయాయి
Latest News

నటి రంభ అందరికీ తెలిసందే . రంభ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రంభ చాలామంది హీరోలతో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 90 లలో స్టార్ హీరోయిన్ గా ఈమె మంచిగా చక్రం తిప్పింది. ప్రస్తుతం రంభ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఈమె సౌత్ లో నార్త్ లో కూడా చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. మలయాళ, కన్నడ, భోజ్పురి, హిందీ వంటి భాషల్లో కూడా ఈమె సినిమాలు చేసింది. దివ్యభారతి చనిపోయిన తర్వాత రంభ అచ్చం దివ్యభారతి పోలికలతో ఉండడంతో ఆమె చనిపోయినప్పుడు ఆగిపోయిన సినిమాలు ని ఈమె తో చేశారు. ఆ ఒక్కటి అడక్కు అనే మూవీ తో రంభ టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయమైంది.

రంభ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. ఆస్తులు పోయాయి
Rambha

తర్వాత ఈమెకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. స్పెషల్ డాన్సులు కూడా ఈమె పలు సినిమాల్లో చేసింది. 2003లో రంభ స్వయంగా నిర్మాతగా వ్యవహరించింది. త్రీ రోజెస్ అనే మూవీ ని ఈమె తెర మీదకి తీసుకువచ్చింది కానీ మూవీ డిజిస్టర్ రావడంతో ఆస్తులు అన్ని పోయాయి మళ్లీ డబ్బులు సంపాదించుకోవడానికి ఐటమ్ సాంగ్స్ చేయడం కూడా మొదలు పెట్టింది. 2010లో ఇంద్ర కుమార్ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ మధ్యకాలంలో భర్తకి విడాకులు ఇవ్వబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఆర్థిక సమస్యలు ఇందుకు కారణమని తెలుస్తోంది. కానీ రాఘవేంద్రరావు సహాయం చేసి వీళ్ళు కలిసి ఉండేలా చేశారట.