భరత్‌ వచ్చినా చిట్టిబాబు తగ్గలేదుగా!

Bharat Ane Nenu Movie Crossed Rangasthalam Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం భారీ ఓపెనింగ్స్‌ను రాబట్టి కేవలం వారం రోజుల్లో 100 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిన ఈ చిత్రం టాలీవుడ్‌ టాప్‌ 3 చిత్రంగా నిలిచింది. రంగస్థలం చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకులు నిరాజనాలు పలికారు. ఆ సమయంలోనే భరత్‌ అనే నేను చిత్రం విడుదల అవ్వడంతో రంగస్థలం చిత్రం కలెక్షన్స్‌ పూర్తిగా డ్రాప్‌ అవుతాయని అంతా భావించారు. 200 కోట్లకు కాస్త తక్కువతో రంగస్థలం క్లోజ్‌ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు. కాని తాజాగా రంగస్థలం చిత్రం 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసిందని చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

సమ్మర్‌ సెలవులు అవ్వడంతో పాటు భరత్‌ అనే నేను చిత్రం తప్ప మరే సినిమా బాక్సాఫీస్‌ వద్ద లేకపోవడం వల్ల రంగస్థలం చిత్రంకు సాధ్యం కాదు అనుకున్నది సాధ్యం అయ్యింది. కాస్త కష్టంగా 200 కోట్ల కలెక్షన్స్‌ను రంగస్థలం చిత్రం వసూళ్లు చేసింది. ప్రస్తుతానికి ‘రంగస్థలం’ చిత్రం నెం.3గా ఉంది. అయితే భరత్‌ అనే నేను చిత్రం చాలా స్పీడ్‌గా కలెక్షన్స్‌ను పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే 175 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ చిత్రం మరో వారం రోజుల్లో 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించడం ఖాయం. ‘నా పేరు సూర్య’ చిత్రం రాబోతున్న నేపథ్యంలో ‘రంగస్థలం’ మరియు ‘భరత్‌ అనే నేను’ చిత్రా కలెక్షన్స్‌ పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. ఆలోపుగానే భరత్‌ చిత్రం 200 కోట్ల మార్క్‌ను చేరుతుందేమో చూడాలి.