బీజేపీ ఎంపీ జీవీఎల్ కారు ప్రమాదం, మహిళ మృతి…!

Bjp Mp GVL CAr Hits To Women

గుంటూరు విజయవాడ హైవే మీద కొలనుకొండ ప్రాంతంలో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు కారు బీభ‌త్సం సృష్టించింది. ఒంగోలులో పార్టీ కార్యక్రమానికి హాజరయిన జీవీఎల్ విజ‌య‌వాడకు కారులో బయలుదేరారు ఆయన కారు మంగ‌ళ‌గిరి దగ్గరలోని కొలనుకొండ వ‌ద్ద ప్ర‌మాదానికి గురైంది.

Bjp Mp GVL CAr Hits To Women

మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న జీవీఎల్ కారు రోడ్డు దాటున్న వారిని తప్పించ‌బోయి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. దీంతో కారు అదుపు త‌ప్పి ఇద్దరు మ‌హిళ‌లను ఢీకొట్టింది. మెరుపు వేగంతో జరిగిపోయిన ఈ ఘ‌ట‌న‌లో ఒక మ‌హిళ అక్క‌డిక‌క్క‌డే మృతి చెంద‌గా మ‌రో మహిలకి తీవ్ర గాయాల‌య్యాయి. అయితే అనునిత్యం నీతీ నిజాయితీకీ బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పే జీవీఎల్ అక్కడ ఒక మనిషి ప్రాణం పోతే పార్టీ సమావేశానికి సమయం మించిపోతున్నదనే కారణం చూపి అక్కడ తన డ్రైవర్ ని పోలీసులకి అప్పచెప్పి ఆయన ఎంచక్కా వేరే కారెక్కి విజయవాడ వెళ్ళిపోయారు.

gvl-vahical-car

అయితే జీవీఎల్ ప్ర‌యాణించి ప్రమాదానికి గురయిన కారు బీజేపీ ఏపీ రాష్ట్ర ఆఫీస్ పేరుపై న‌మోదైంది. పార్టీ పేరు మీద నమోదయి ఉన్న ఈ కారు ఇంతకుముందే ఓవర్ స్పీడ్ చెలానాలు రెండు, ట్రాఫిక్ వయలేషన్స్ చెలానాలు మరో మూడు మొత్తం ఐదు చెలానాలు పెండింగ్ లో ఉన్నాయి.

GVL-CARS