యూపీలో ప‌డ‌వ ప్ర‌మాదం

boat-capsizes-in-up-22-people-died

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని భాగ‌ప‌త్ లో ఘోర‌ప్ర‌మాదం జ‌రిగింది. య‌మునా న‌దిలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ప‌డ‌వ మునిగిపోయింది. ఈ ప్ర‌మాదంలో 22 మంది మ‌ర‌ణించారు. ప్ర‌మాద స‌మ‌యంలో ప‌డ‌వ‌లో 60 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. సామ‌ర్థ్యానికి మించి ప్ర‌యాణికుల‌ను ఎక్కించుకోవ‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు భావిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 22మృత‌దేహాలు వెలికితీశారు. మ‌రో ప‌దిమందిని రక్షించి ఆస్ప‌త్రికి త‌రలించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు చెబుతున్నారు. ఈ ప్ర‌మాదంపై యూపీ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ దిగ్భ్రాంతి వ్య‌క్తంచేశారు. మృతుల కుటుంబాల‌కు రూ. 2ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం ప్ర‌క‌టించారు.