యూపీలో పిడుగుపాటు.. ఇద్దరు చిన్నారులు మృతి

దేశంలో గత రాత్రి పలుచోట్ల చెదురుమొదురు వర్షం పడింది. అలాగే… ఉరుములు మెరుపులే ఎక్కువగా వచ్చాయి. అంతకుమించి పిడుగులు పడ్డాయి. దీంతో కొన్ని ప్రదేశాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో గత రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఇంటి బ‌య‌ట‌ ఆవరణంలో ఆడుకుంటుండ‌గా పిడుగుప‌డి ఒకే కుటుంబానికి చెందిన ఇద్ద‌రు చిన్నారులు మృత్యువాత పడ్డారు. అయితే అప్ప‌టివరకు కండ్ల‌ముందే ఆడుకున్న పిల్ల‌లిద్ద‌రూ పిడుగుపాటుకు బ‌లికావ‌డంతో వారి త‌ల్లిదండ్రుల గుండెలు అవిసేలా శోకసంద్రంలో మునిగిపోయారు. వారి హదయాలు త‌ల్లిడిల్లిపోయారు.

కాగా గుండెలు బాదుకుంటూ పిల్ల‌లపై ప‌డి రోదిస్తున్న ఆ త‌ల్లిదండ్రులను ఆప‌డం ఎవ‌రి త‌రం కావడం లేదు. కాగా.. ఈ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యానాథ్ తీవ్ర విచారాన్ని వ్య‌క్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.