నంద్యాలలో బాంబుల కలకలం…ఇద్దరు మృతి !

bomb blast At nandyal check post in kurnool district

సాధారణంగా సినిమాల్లో రాయలసీమ అంటేనే బాంబులు కత్తులు అన్నట్టు చూపిస్తారు. నిజానికి అవి ఒకప్పుడు రాజ్యమేలినా ఇప్పుడు అలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదు. అయితే ఈరోజు కర్నూలు జిల్లా నంద్యాల చెక్ పోస్టు సమీపంలో జరిగిన ఒక బాంబు పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అందుతున్న సమాచారం ప్రకారం అవి నాటు బాంబులని తేలింది. నంద్యాల చెక్‌పోస్టు నుంచి జోహరాపురానికి వెళ్లే రోడ్డు పక్కన నున్న పొలంలో ఒక కుటుంబం సర్వే నిర్వహిస్తుండగా అక్కడ ఇంతకు ముందే పెట్టిన బాంబులు పేలడంతో జంపాల రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు.

మరొకరు జంపాల మల్లికార్జున అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. అయితే సర్వే జరిపించడానికి వచ్చిన వరసకు సోదరుడైన విజిలిన్స్ ఏఎస్సై శీను‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల మృతుల కుటుంబం వేరొకరి వద్ద పొలం కొనుగోలు చేశారు. దీంతో సర్వేయర్‌తో పొలంలో కొలతలు కొలుస్తున్నారు. బాంబులు పూడ్చిన విషయం తెలియని వారు మామూలుగనే చెత్తను తగలబెట్టడంతో బాంబులు ఒక్కసారిగా పేలాయి. ఎవరైనా వాటిని ఇక్కడ దాచుకున్నారా ? లేక ఎవరికోసమయినా పాతిపెట్టారా? లేదంటే ఉద్దేశపూర్వకంగానే హత్య చేయాలని బాంబులు పెట్టారా? అనేది తేలాల్సిఉంది.