BREAKING NEWS: మెదక్ అభ్యర్థికి బిగ్ షాక్.. ఎన్నికల కమిషన్ కు లేఖ..

BREAKING NEWS: Big shock for Medak candidate.. Letter to Election Commission..
BREAKING NEWS: Big shock for Medak candidate.. Letter to Election Commission..

మెదక్ లోక్ సభ BJP అభ్యర్థి రఘునందన్ రావుకు ఊహించని షాక్‌ తగిలింది. మెదక్ లోక్ సభ BJP అభ్యర్థిపై మరోసారి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోడీ, రఘునందన్ రావు, బీజేపీ పార్టీ గుర్తు ఫోటోలు ఉన్న క్యాలెండర్ లను ఓటర్లకు పంచుతున్నారని…కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు.

రఘునందన్ రావును ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. మతం పేరుతో రఘునందన్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కాగా, BRS నేతల్ని అసభ్య పదజాలంతో దూషించారని కొన్ని రోజుల క్రితమే రఘునందన్ పై ఫిర్యాదు చేశారు BRS నాయకులు. ఇక ఇప్పుడు ప్రధాని మోడీ, రఘునందన్ రావు, బీజేపీ పార్టీ గుర్తు ఫోటోలు ఉన్న క్యాలెండర్ లను ఓటర్లకు పంచుతున్నారని…కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు.