దారుణం…రెండేళ్ళ బాలిక మీద రేప్…హత్య !

brutal-rape-on-two-year-old-girl-killed

ఎన్ని చట్టాలు చేస్తున్న మన దేశంలో కామాంధుల ఆకృత్యాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. పసికందుల నుంచి కాటికి కాళ్లు చాపుకున్న ముసలవ్వల మీద కూడా అత్యాచారాలకు పాల్పడుతూ దారుణంగా హతమారుస్తున్నారు. ఇటీవలే తెలంగాణలో 9 నెలల పాపపై, 9 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనలు మరువక ముందే మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది.

రెండున్నరేళ్ల చిన్నారిపై సమీప బంధువే అత్యాచారానికి పాల్పడి క్రూరంగా హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన దంపతులు పుణేలోని సంఘవి ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవన సముదాయంలో కూలిపనులు చేసుకుంటూ స్థానికంగా నివాసముంటున్నారు. వారికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. ఇంట్లోనే నిద్రించిన దంపతులు మరుసటి రోజు ఉదయం లేచి చూసేసరికి చిన్నారి పక్కన లేదు.

దీంతో వారు చుట్టుపక్కల ప్రాంతంలో గాలించగా ఓ కాలువ వద్ద చిన్నారి శవమై కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రకి తరలించారు. పోస్టుమార్టం నివేదికలో చిన్నారి లైంగిక దాడికి గురైనట్లు డాక్టర్లు చెప్పడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.

దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బాలిక బంధువే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి వేళ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి చంపేసినట్లు నిందితుడు అంగీకరించడంతో పోలీసులు అతడిపై ఐపీసీ 450, 302, 366, 376, 363 సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.