ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్..

Chandrababu Bail Petition in AP High Court
Chandrababu Bail Petition in AP High Court

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు.. అయితే, చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్.. నేడు విచారణ న్యాయస్థానం చేయనుంది . చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

ఇక ఇవాళ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ,పవన్‌ కల్యాణ్‌, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చంద్రబాబుతో ములాఖత్‌కు వెళ్లనున్నారు. ముందుగా వీరు ముగ్గురు రాజమహేంద్రవరంలో భేటీ కానున్నారు. ఈ భేటీ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకోనుంది.

ఇవాళ ఉదయం పవన్‌ కల్యాణ్‌ రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం బాలయ్య, పవన్‌ రాజమహేంద్రవరంలోనే ఉన్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడుpolitics లోకేశ్‌లను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బాలకృష్ణ, లోకేశ్‌,పవన్‌ కలిసి కేంద్ర కారాగారానికి వెళ్లి చంద్రబాబుతో ములాఖత్‌ కానున్నట్లు సమాచారం.