పవన్‌కు పద్దులు పంపిన ఏపీ ప్రభుత్వం

AP Government Supports Pawan Kalyan JFC
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధన కోసం పవన్‌ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన జేఎఫ్‌సీ నిన్న, నేడు హైదరాబాద్‌లో భేటీ అయిన విషయం తెల్సిందే. ఏపీకి కేంద్రం నుండి వచ్చిన నిధులు ఎన్ని, కేంద్రం విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు ఏంటీ అనే విషయాలను ఈ కమిటీ గుర్తించాలని నిర్ణయించింది. ఆ వివరాలను తెలియజేయాల్సిందిగా ఆర్టీఐ ద్వారా ఏపీ ప్రభుత్వంను మరియు కేంద్ర ప్రభుత్వంను పవన్‌ అండ్‌ టీం అడిగిన విషయం తెల్సిందే. 

జేఎఫ్‌సి కోరిన వివరాలను ఏపీ ప్రభుత్వం నేడు హైదరాబాద్‌ పంపించింది. అమరావతి సచ్చివాలయం నుండి 118 పేజీల ప్రత్యేక నివేదికను ఏపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు పవన్‌ కళ్యాణ్‌ ఆఫీస్‌కు పంపించడం జరిగింది. పవన్‌ కళ్యాణ్‌ సమయానికి అందుబాటులో లేకపోవడంతో పవన్‌ సహయక సిబ్బందికి జనసేన కార్యలయంలో అందజేయడం జరిగింది. ఆ నివేదికపై మరోసారి జేఎఫ్‌సి చర్చించే అవకాశం ఉంది. ఏపీకి వచ్చిన నిధులు, ఎలా ఖర్చు చేశారు, కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు ఇలా అన్ని విషయాలను అందులో పొందు పర్చడం జరిగింది.