మెగాస్టార్ చిరంజీవి 12ఏళ్ల కలకు తెర రూపం సైరా నర్సింహా రెడ్డి 151వ చిత్రం కాగా తెలుగు తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.
దసరాను రోజున సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని నిర్వహించగా చిరంజీవి భార్య సురేఖ క్లాప్ కొట్టి ప్రారంభించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు కలిసి నిర్మాణ సారథ్యం వహిస్తున్నాయి. సైరా విజయం తర్వాత చిరు ఇమేజ్ను తగ్గట్టు ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి.
అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. చిత్రంలో కథానాయిక ఎవరనేది ఒక నిర్ణయానికి ఇంకా రాలేదు. కథకి తగ్గట్టు హీరోయిన్ పాత్రకు త్రిషని ఎంపిక చేసినట్టు కథనాలు వినపడ్డాయి.
రెండో హీరోయిన్కి కూడా ఛాన్స్ ఉండడం వల్ల ఎవరిని ఎంచుకోవాలనేది చిత్ర బృందం ఇంకా నిర్ణయించుకోలేదు. గోవా బ్యూటీ ఇలియాన లేదా శృతి హాసన్ లలో ఒకరు రెండవ హీరోయిన్ అని టాక్ వినిపిస్తుంది. దేవాలయాలకు సంబంధించిన కథా నేపథ్యంలో ఈ చిత్రం చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.