వైరల్ అవుతున్న వీడియో సాంగ్‌ ప్రోమో

వైరల్ అవుతున్న వీడియో సాంగ్‌ ప్రోమో

విద్యార్థి ఉద్యామాలకు తెరతీసిన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి. ఓ విద్యార్థి నాయకుడి బయోపిక్‌గా వస్తున్న జార్జి రెడ్డి సినిమా ట్రైలర్ వైరల్ అయ్యింది. పి.డి.యస్.యు అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్యను స్థాపించిన నాయకుడు. చిన్న వయసులోనే క్యాంపస్లోనే ప్రత్యర్థుల చేతిలో హతం అయిన జార్జిరెడ్డి విద్యార్థి ఉద్యమాల్లో ఒక తిరుగులేని తేజం.

దసరా రోజున చిత్ర బృందం ట్రైలర్ని విడుదల చేయగా వన్ మిలియన్ వ్యూస్ ని అందుకుంది. అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపిస్తూ క్వాలిటీ పరంగా, క్వాలిటి పరంగా మంచిటాక్ ని అందుకోబోనునది.

ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ఉద్యమ నాయకుడి ఆయన జీవితం గురించి తెలుసు. తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్‌ సాంగ్‌ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. “వాడు నడిపే బండి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు” అంటూ సాగే పాటకు మిట్టపల్లి సురేందర్‌ సాహిత్యం అందించారు. ఈ పాట ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి చిత్రం పోస్టర్‌ను ఆవిష్కరించారు. అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నవంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రానికి సుధాకర్‌ యెక్కంటి కెమెరా అందించగ సురేష్‌ బొబ్బిలి సంగీతం అందించారు.