మెగాస్టార్ చిరంజీవి తన 151వ మూవీ సైరా నరసింహారెడ్డి కోసం ప్రాణం పెట్టి మరీ నటిస్తున్నాడు. శారీరక శ్రమను భరిస్తూ రోజుకు నాలుగు నుండి అయిదు గంటలు మాత్రమే చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా చిరంజీవి చాలా యాక్టివ్గా భారీ యాక్షన్ సీన్స్ మరియు యుద్ద సన్నివేశాల్లో నటిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలోని ఒక సీన్ను నీటిలో చిత్రీకరించబోతున్నారట. చిరంజీవి నీటిలో ఆ సీన్ను చేయబోతున్నాడు. చిరంజీవి వయసు రీత్యా ఆ సీన్ వద్దని అంతా సూచించినా కూడా ఆయన మాత్రం ఒప్పుకోవడం లేదు. హాలీవుడ్ యాక్షన్ టీం ఆధ్వర్యంలో సురక్షితంగా ఈ షాట్స్ను చేయబోతున్నారట.
నీటిలో జరిగే యాక్షన్ సీన్స్ కోసం దాదాపుగా పది నుండి పదిహేను రోజులుగా ట్రైనింగ్ జరుగుతుందట. త్వరలోనే చిత్రీకరణ ఉంటుందని సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రంలో ఈ సీన్స్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సీన్స్ మరియు యుద్ద సన్నివేశాల్లో కూడా చిరంజీవి చాలా కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖైదీ నెం.150 చిత్రం సమయంలో పడ్డ కష్టంకు ప్రస్తుతం పది రెట్ట కష్టంను చిరంజీవి పడుతున్నట్లుగా తెaుస్తోంది. ఫలితం కూడా అదే స్థాయిలో ఉంటుందనే నమ్మకంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో అంచనాaున్న ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.