ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదు..

CM Chandrababu Naidu
CM Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గంజాయి సహా మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఆయన చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా ఇతర నేరాలకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛాంధ్రలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలి. ఏపీని స్వచ్ఛాంధ్ర చేయాలని సంకల్పించాం. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. నేరస్థుల పట్ల కఠినంగా ఉంటాం. ఆడబిడ్డల జోలికి వచ్చిన వారిని వదిలేది లేదని అన్నారు.