పేదోడి ఇంట్లో సీఎం రేవంత్ భోజనం..!

Telangana Chief Minister Revanth Reddy
Telangana Chief Minister Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదా మరిచి సామాన్యుడిలా మారిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో సీఎం రేవంత్ పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్దిదారుడి ఇంటికి వెళ్లారు. అందరితో కలిసి సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు. అనంతరం వారి జీవన పరిస్థితులు, కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు.