ఢిల్లీలో అధికంగా ఉన్న కరోనా మరణాల సంఖ్య

ఢిల్లీలో అధికంగా ఉన్న కరోనా మరణాల సంఖ్య

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి భారిన రోజుకి 11 వేలకు పైగా అనారోగ్యం పాలు అవుతున్నారు. వందల సంఖ్యలో కరోనా వైరస్ సోకి మృతి చెందుతున్నారు. అయితే భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ఢిల్లీ లోనే. కరోనా వైరస్ కారణంగా అక్కడి ప్రజలు అనేక సమస్యలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే కరోనా వైరస్ సోకింది ఏమో అన్న అనుమానం తో ఇప్పటికే పలువురు ఆత్మహత్యలు చేసుకొని మరణించారు. అయితే ఇదే కోవలో ఒక ఐ ఆర్ ఎస్ అధికారి ఆత్మహత్య చేసుకొని మరణించారు.

కరోనా వైరస్ సోకిందేమో అన్న అనుమానం కాస్త పెను భూతం లా మారింది. ఢిల్లీ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 41,182 కి చేరింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఢిల్లీ లో ఇప్పటి వరకు 1,327 మంది మరణించారు. భారత్ లో ఎక్కువ శాతం కరోనా వైరస్ మరణాలు సంభవిస్తున్న రాష్ట్రం లో ఢిల్లీ కూడా ఉంది.