తీవ్ర స్థాయికి చేరుతున్న కరోనా

తీవ్ర స్థాయికి చేరుతున్న కరోనా

భారత్ లోకి కరోనా ఎంటర్ అయ్యిన కొద్ది రోజులలోనే తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రలలో అయితే గత కొన్ని రోజులలోనే మరింత స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పుడు తాజాగా ఏపీలో గత 24 గంటల్లో నెలకొన్న కరోనా పాజిటివ్ కేసుల తాలూకా సమాచారాన్ని ఆంధ్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు.

అయితే నిన్నటితో పోలిస్తే కాస్త తక్కువే నమోదు అయినా కాస్త ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి అని చెప్పాలి. నిన్న ఏపీలో 80 కేసులు నమోదు కాగా గడిచిన 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఏపీలో మొత్తం కరోనా కేసులు ఇప్పుడు 955 కు చేరిపోయింది. ఇదే ఇలా ఉంటే రేపటికి ఖచ్చితంగా వెయ్యి కోవిడ్ పాజిటివ్ కేసులు దాటేయ్యడం ఖాయం అని చెప్పాలి.ఇదిలా ఉండగా కర్నూల్ జిల్లా మాత్రం అత్యధిక కేసులుతో ఇప్పుడప్పుడే తగ్గు ముఖం పట్టేలా లేదని చెప్పాలి.