జర్నలిస్ట్ కి కరోనా పాజిటివ్: మాజీ సీఎం ప్రెస్ మీట్ కు హాజరైన జర్నలిస్ట్…..

కరోనా తాకిడి మీడియాను సైతం తాకింది.మధ్యప్రదేశ్ లో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ రావడం తీవ్ర కలకలాన్ని సృష్టిస్తోంది. ఆ జర్నలిస్ట్ ఐదు రోజుల కిందట మాజీ సీఎం కమల్ నాథ్ నిర్వహించిన ప్రెస్ మీట్ కు హాజరు కావడం అందరిలో మరింత ఆందోళన కలిగిస్తొంది.ఆ ప్రెస్ మీట్ కు వచ్చిన మిగతా జర్నలిస్టులందరినీ క్వారైంటైన్ లో ఉంచి వైద్య పరిక్షలు చేస్తున్నారు.జర్నలిస్టు కుమార్తెకు గతంలో పాజిటివ్ రావడంతో ఆమె ద్వారానే అతనికి కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.ప్రేస్ మీట్ కి హాజరైన మిగతా ఛానళ్లను, పేపర్ రిపోర్టలను అందరినీ క్వారంటైన్ కి వెంటనే తరలించినట్లు సమాచారం.అంతేకాక పాకిస్థాన్ లోనూ ముగ్గురు జర్నలిస్ట్ లకు కరోనా పాజిటివ్ నమోదైనట్లు తెలియజేశారు.