Crime: మూడు నెలల క్రితం అంత్యక్రియలు.. మళ్లీ ప్రత్యక్షమైన వ్యక్తి..

Crime: Murdered their daughters last month... committed suicide today
Crime: Murdered their daughters last month... committed suicide today

గోవాలో ఊహించని ఘటన వెలుగుచూసింది. తమ వ్యక్తే చనిపోయాడని భావించి మూడు నెలల క్రితం అంత్యక్రియలు నిర్వహించిన ఓ కుటుంబానికి.. మళ్లీ అతను ప్రత్యక్షం కావడం షాక్కు గురిచేసింది. పోలీసుల కథనం ప్రకారం.. గోవా రాజధాని పనాజీ సమీపంలోని గ్రామంలో నివసించే మార్కోస్ మిలాగ్రేస్ (59).. 2023లో కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అదే ఏడాది అక్టోబరులో పోలీసులను ఆశ్రయించారు. అదే నెల 7న పనాజీలో పోలీసులకు ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అది మిలాగ్రేస్దేనని కుటుంబ సభ్యులు నిర్ధరించారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించగా.. అంత్యక్రియలు నిర్వహించారు. ఇది జరిగిన రెండు నెలల తర్వాత గోవా పోలీసులకు ముంబయి నుంచి ఫోన్ వచ్చింది. ఓ వ్యక్తి తననుతాను మిలాగ్రేస్గా చెప్పు కొంటున్నట్లు సమాచారం అందించారు. దీంతో అతన్ని గోవా తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులను పిలిపించగా.. వారు మిలాగ్రేస్ను చూసి షాక్కు గురయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆయన ముంబయి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే.. మిలాగ్రెస్ కుటుంబానికి ఎవరి మృతదేహాన్ని అప్పగించారనేది తేలాల్సి ఉంది.