Crime: ఏపీలో విషాదం.. పెళ్లైన 4 రోజులకే గోదావరిలో దూకిన యువజంట

Crime: Murdered their daughters last month... committed suicide today
Crime: Murdered their daughters last month... committed suicide today

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది ఓ నవజంట. అయితే… గోదావరిలో గల్లంతైన కోరాడ సత్యవతి మృతి చెందింది. మత్స్య కారులు, పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలలో కోరాడ సత్యవతి మృతదేహం లభ్యమైంది. పెళ్లైనా నాలుగోవ రోజే మృత్యువాతకు గురైంది నవ వధువు కోరాడ సత్యవతి.

ఈ నెల 15న కోరాడ సత్యవతి, శివరామకృష్ణ ల వివాహం జరిగింది. అయితే.. ఈ నె 19వ తేదీన రావులపాలెం లో సినిమా చూసి తిరిగి వస్తుండగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు..చోటు చేసుకున్నాయి. దీంతో సిద్ధాంతం బ్రిడ్జి పైనుంచి గోదావరిలో దూకారు నవ వధూవరులు కోరాడ సత్యవతి, శివరామకృష్ణ. అయితే… శివరామ కృష్ణను స్థానికులు కాపాడగా గల్లంతయిన సత్యవతి మృతదేహం ఈ రోజు లభ్యం అయింది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.