Crime: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అరకేజీ బంగారం చోరీ

Crime: Thieves' rampage in Hyderabad... Arakeji gold stolen
Crime: Thieves' rampage in Hyderabad... Arakeji gold stolen

హైదరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు ఇళ్లల్లో చొరబడి చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా మధురానగర్ ఠాణా పరిధిలో ఓ ఇంట్లో నుంచి అరకేజీ బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ మధురానగర్‌ ఠాణా పరిధిలోని సిద్ధార్థ నగర్కు చెందిన పి.సూర్యనారాయణ రాజు తన ఇంట్లోని బీరువా తాళం చెవి కనిపించకపోవడంతో డూప్లికేట్‌వి తయారు చేయించాలనుకున్నాడు. అందుకోసం డూప్లికేట్ తాళం చెవులు తయారు చేయించే వారిని ఇంటికి పిలిపించాడు. వారు కూడా ఎంత ప్రయత్నించినా బీరువా తెరుచుకోలేదు. దాంతో చేసేదేం లేక వారు అక్కడనుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత కొన్నిరోజులకు పోయిన తాళం చెవి కనిపించడంతో సూర్యనారాయణ బీరువా తెరిచాడు. అయితే అందులో దాచిన అరకిలో బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో షాక్ అయ్యాడు. డూప్లికేట్‌ కీ చేసేందుకు వచ్చిన వారే ఈ బంగారం దోచుకెళ్లి ఉంటారని భావించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.