కృష్ణాలో దారుణం…’ఆ’ సంబంధం కోసం కన్నతండ్రి దారుణ హత్య !

daughter kills father For Illegal releanship At Krishna district

మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో అర్ధం కావట్లేదు…క్షణిక సుఖాల కోసం ఏమి చేస్తున్నారో కూడా అర్ధం కావడం లేదు. వివాహేతర సంబంధం వద్దని తన అనైఖిక సంబంధానికి అడ్డ తగులుతున్న తండ్రిని ప్రియుడితో కలసి మట్టుబెట్టిందో కూతురు. ఈ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన లింగమనేని శేషుకుమారి భర్త 2011లో చనిపోయాడు. కుమారుడి చదువు కోసం ఆమె నూజివీడు పట్టణంలోని తుమ్మలవారి వీధిలో అద్దెకు ఉంటోంది. ఆమె తండ్రి కూడా కుమార్తె వద్దే ఉంటూ ఓ హోటల్ లో పని చేస్తున్నాడు.

గ్యాస్ స్టౌవ్ మెకానిక్ వేముల వెంకటేశ్వరరావుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది మంచి పద్ధతి కాదని ఆమెను తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా వినకుండా ఆమె తన అనైతిక సమంధాన్ని కొసాగించింది. జూన్ 30న రాత్రి పది గంటల సమయంలో తన ప్రియుడితో కలసి ఇంట్లో ఆమె ఉండటాన్ని తండ్రి గమనించి కేకలు వేయడం మొదలు పెట్టాడు. తమ అనైతిక బంధం ఎక్కడ బయట పడుతుందో అని భయపడిన ఆ ఇద్దరూ ఆయన నోరు నొక్కి ఊపిరి ఆడకుండా చేశారు. అనంతరం ఇనుపరాడ్డుతో తలపై కొట్టి, చంపేశారు. శవాన్ని ఉదయాన్నే కారు డిక్కీలో వేసుకుని ఆగిరిపల్లి, కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు మీదుగా వెలువోలు దాటి పురిటిగడ్డ సమీపంలో నిమ్మగడ్డ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణించి వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

గుర్తు తెలియని మృత దేహంగా పోలీసులు కేసు నమోదు. పత్రికల్లో వార్తలు చూసి తండ్రిని గుర్తు పట్టామంటూ చల్లపల్లి వచ్చిన కుమార్తె శేషుకుమారి తండ్రి పింఛన్‌ కోసం అంగలూరు వెళ్లి కనిపించలేదని, ఫోన్‌ కూడా తీసుకెళ్లలేదని నమ్మబలికింది. తర్వాత తండ్రి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అవనిగడ్డలోనే ఖననం చేయించి వెళ్లిపోయింది. అయితే ఆమె చెప్పిన విషయాలు, కాల్‌డేటా సమయాల్లో తేడా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అనుమానం వచ్చిన పోలీసులు కాల్ డేటాను, నూజివీడు నుంచి శవం పడేసిన స్థలం వరకు ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. దీంతో, మొత్తం విషయం వెలుగులోకి వచ్చింది. శేషుకుమారి, ఆమె ప్రియుడు వెంకటేశ్వరరావులను అరెస్ట్ చేసిన పోలీసులు, అవనిగడ్డ కోర్టుకు తరలించారు.