మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గత కొంత కాలంగా వరుసగా రాధాకృష్ణ నిర్మాణంలోనే సినిమాలు చేస్తున్నాడు. ఈయన వరుసగా హారిక హాసిని బ్యానర్లో సినిమాలు చేస్తున్నాడు. గతంలో త్రివిక్రమ్కు దానయ్య అడ్వాన్స్ ఇచ్చాడు. తన బ్యానర్లో ఒక చిత్రాన్ని చేయాల్సిందిగా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి అదుగో ఇదుగో అంటూ వస్తున్నాడు. దానయ్య ఇన్నాళ్లుగా త్రివిక్రమ్ ఇకనైనా తన బ్యానర్లో సినిమా చేయకుండా పోతాడా అంటూ ఎదురు చూశాడు. ఇక ఆ ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెట్టి, తాను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాడు.
నెల రోజుల్లో తన బ్యానర్లో సినిమా చేసేది లేనిది తేల్చి చెప్పాలని, లేదంటే తాను ఇచ్చిన అడ్వాన్స్ను తిరిగి ఇచ్చేయాల్సిందిగా పేర్కొన్నాడు. గతంలో రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించేందుకు దానయ్య ప్లాన్ చేసి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది. అప్పటి నుండి త్రివిక్రమ్ వరుసగా రాధాకృష్ణ నిర్మాణంలోనే సినిమాలు చేస్తున్నాడు. అందుకే దానయ్య తాను ఇచ్చిన అడ్వాన్స్ను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే త్రివిక్రమ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.