విశాక ఎయిర్పోర్ట్ నేవీ అండర్ లోకి…యుద్ధ సన్నాహామా..? లేక

Defence ministry takes visakha airport into their control

విశాఖ విమాశ్రయానికి ప్రయాణికులని తెచ్చే విమానాల రాకపోకలపై కేంద్ర రక్షణ శాఖ గుట్టుచప్పుడు కాకుండా ఆంక్షలు విధించింది. నేవీ అవసరాలకోసం ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు విమానాల రాకపోకలను నిలిపివేయాలని రక్షణ శాఖ విశాఖ విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. అలా తీసుకుని ప్రతి రోజు ఉ.9.30 నుంచి మ.12.30 వరకు, రాత్రి 7 నుంచి 9 వరకు విమానాల రాకపోకల మీద ఆంక్షలు విధించారు. నిజానికి ఆ సమయంలోనే ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పీక్ టైంలో కేంద్రం ఇలా తమ అధీనంలోకి తీసుకోవడం మీద పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. విశాఖ విమానాశ్రయం నేవీ ఈస్ట్రన్ కమాండ్ అధీనంలో ఉండేది అందుకే విమానాశ్రయాన్ని రక్షణ అవసరాలకు ఎక్కువగా ఉపయోగించేవారు. సివిల్ ఏవియేషన్ ట్రాఫిక్‌కు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజన ముందు అంతంత మాత్రమె ఉన్న ఎయిర్‌ట్రాఫిక్ రాష్ట్ర విభజన తర్వాత అనూహ్యంగా పెరిగింది. కొద్ది రోజుల కిందట ఇరవై నాలుగు గంటలూ విమానాల రాకపోకలకు అనుమతి లభించింది. ఏమయిందో ఏమో కానీ ఇప్పుడు హఠాత్తుగా.. కేంద్ర రక్షణ శాఖ… విమానాల రాకపోకలు సాగించే సమయంపై.. ఆంక్షలు విధించింది. రాష్ట్ర విభజన తర్వాత.. విశాఖ సిటీ ఇప్పుడిప్పుడే మెట్రో పాలిటన్ సిటీగా రూపాంతరం చెందుతోంది. దేశవిదేశాల నుంచి వివిధ రంగాల ప్రముఖులు.. వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం వచ్చిపోతున్నారు. పర్యాటకుల పరంగానూ… అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు విమాన ప్రయాణాల చిక్కులు ఏర్పడితే అది విశాఖకు చాలా మైనస్ అవుతుంది.

అయితే రక్షణ శాఖ ఈ చర్య చేపట్టిన సమయంలోనే కశ్మీర్‌ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చింది. కశ్మీర్‌లో మిలిటెంట్లపై దాడుల పేరుతో లేనిపోని ఉద్రిక్తతలు సృష్టించి పాకిస్థాన్‌ మీద ఓ మాదిరి యుద్దం చేయడం ద్వారా దేశ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి ఎన్నికలకు వెళ్లాలన్న వ్యూహంలో బీజేపీ ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. యుద్ధ సన్నాహాల కోసం విశాఖ ఎయిర్‌పోర్టును సిద్ధం చేసేందుకే విమానాల రాకపోకల మీద ఆంక్షలు విధించింది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయం మీద ముందుకెళితే ఆంధ్రా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో.. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌పై కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి వ్యవహారాలు చేస్తోందనే భావన సామాన్య ప్రజల్లో సైతం వ్యక్తమవుతోంది. నిజానికి విశాఖ ఎయిర్‌పోర్టు నేవీదని ప్రజలకి పెద్దగా అవగాహన లేదు. ఇది ప్రజల అవసరాల కోసమే ప్రభుత్వం నిర్మించింది అని అనుకుంటున్నారు. ఎలాగూ బీజేపీ బతికి బట్ట కట్టే పరిస్థితి ఆంధ్రాలో కనపడం లేదు. ఇప్పుడు పాక్ మీద యుద్ద వాతావరణం సృష్టించి ఆ నెపంతో వోట్లు అడిగితే కనీసం జాతీయ స్థాయిలో అయినా గెలిచే అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. మరో పక్క విశాఖపట్నం విమానాశ్రయంలో విమానాల రాకపోకల సమయాలపై ఎలాంటి ఆంక్షలు విధించొద్దని రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు బుధవారం లేఖ రాశారు. ప్రస్తుత షెడ్యూళ్ల ప్రకారమే పౌర విమానాల రాకపోకలను అనుమతించాలని ఆయన కోరారు.