ఢిల్లీలో వెంటిలేటర్ లేక మాజీ ఎంపీ కోడలు మృతి

కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే ఆమె పాలిట కాలయముడు.....

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కరోనా తీవ్రత వీరలెవల్లో విజృంభిస్తోంది. అసలు దేశంలో కరోనా స్థాయి ఏవిధంగా ఉంది అనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. మాజీ ఎంపీ, ప్రముఖ జర్నలిస్ట్ షాహిద్ సిద్దిఖీ మేనకోడలు సరైన సమయానికి వెంటిలేటర్ లభించక పోవడంతో మృత్యువాత పడింది. ఈ ఘటన దేశ రాజధానిలోని ప్రతిష్ఠాత్మకమైన ఆసుపత్రుల్లో ఒకటైన సఫ్దర్ జంగ్ హాస్పిటల్ లో జరగడం షాక్ కి గురిచేస్తుంది. అయితే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన షాహిద్, ఆసుపత్రిలో రోగులను తీవ్ర నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆరోపించారు. అలాగే.. అక్కడ ప‌రిస్థితి చాలా ద‌య‌నీయంగా ఉందని.. ఎంతో మంది చ‌నిపోతున్నార‌ని అసలు జనాలు ఎటు పోతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది తెలిపారు.

అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న తన మేనకోడలు ముమ్మ‌న్‌ కు అత్యవసర సేవకోసం ఐసీయూలోకి తీసుకెళ్లలేదని.. సమయానికి వెంటిలేటర్ పెట్టలేదని ఆయన తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. ప్రజల ప్రాణాల‌ను రక్షించడానికి కృషి చేయాల్సిన ఆసుపత్రులు, దాన్ని పక్కన పెట్టాయని.. ఢిల్లీ ప్రజల విష‌యంలో తనకు ఇప్పుడు చాలా బాధ కలుగుతోందని స్పష్టం చేశారు. కాగా రాజ‌కీయాల‌ను కాసేపు ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వివరించారు.

కాగా ఢిల్లీ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్రభుత్వానికీ మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోందని కూడా ఆయన తన వ్యాఖ్యల లోగుట్టుగా తెలుస్తోంది. అలాగే.. రాజకీయాలు చేయవద్దని తెలిపిన  షాహిద్ ప్రభుత్వాలు రాజకీయాలకే పరిమితమైతే మ‌రింత పెద్ద సంక్షోభం త‌లెత్తుతుందని ఆయన తీవ్రంగా హెచ్చ‌రించారు. త‌న మేనకోడలు ముమ్మన్ అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింద‌ని, చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరొక ఆసుపత్రికి తీసుకు వెళ్లినా ఎవ‌రూ ఎడ్మిట్ చేసుకోని పరిస్థితి ఢిల్లీలో ఉండటం శోచనీయమని షాహిద్ తీవ్ర ఆరోపణలు చేశారు.