నానిని వదలట్లేదుగా..!

Dil Raju again Producing

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నాని, కీర్తి సురేష్‌ జంటగా ‘నేను లోకల్‌’ చిత్రం విడుదలకు ముందే ఆ నిర్మాత నుండి దిల్‌రాజు పూర్తిగా కొనుగోలు చేశాడు. ‘నేను లోకల్‌’ సినిమాపై దిల్‌రాజు నమ్మకం నిజమైంది. ఆ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని దిల్‌రాజుకు మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఆ సినిమాను నిర్మించలేక పోయిన దిల్‌రాజు ప్రస్తుతం నానితో ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. నాని వరుసగా ఏడు సక్సెస్‌లను దక్కించుకుని ‘మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి’తో ఎనిమిదవ సక్సెస్‌ను దక్కించుకోబోతున్నాడు అంటూ దిల్‌రాజు చాలా నమ్మకంగా ఉన్నాడు. నాని వల్ల మరోసారి భారీగా లాభాలు దక్కించుకోవడం ఖాయం అని దిల్‌రాజు అండ్‌ కంపెనీ భావిస్తుంది. నానిపై నమ్మకంతో దిల్‌రాజు మరో సినిమాను కూడా కొనుగోలు చేయడం జరిగింది. 

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘కృష్ణార్జునయుద్దం’ చిత్రం పంపిణీ హక్కులను దిల్‌రాజు దక్కించుకున్నాడు. ఇంకా ఆ సినిమా విడుదలకు చాలా సమయం ఉంది. అయినా కూడా నాని చెప్పిన చిన్న స్టోరీ లైన్‌ మరియు దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న తీరు చూసి ఖచ్చితంగా ఆ సినిమా కూడా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంతో దిల్‌రాజు భారీ మొత్తం వ్యచ్చించి మరీ రైట్స్‌ను కొనుగోలు చేయడం జరిగింది. నానితో ఈ రెండు సినిమాలతోనే కాకుండా మరో సినిమాను నిర్మించేందుకు కూడా దిల్‌రాజు ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2018లో దిల్‌రాజు బ్యానర్‌లో నాని మరో సినిమాను చేయనున్నాడు. ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి నానిని దిల్‌రాజు గట్టిగా ఒడిసి పట్టుకుని వదలకుండా లాభాలు దండుకుంటున్నాడు.