నెక్ట్స్‌ నువ్వే.. అల్లు శిరీష్‌ మిస్‌ అయ్యాడా?

director prabhakar Planned with allu Sirish but did with Aadi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆది హీరోగా ప్రభాకర్‌ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ‘నెక్ట్స్‌ నువ్వే’ చిత్రం ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇటీవల వరుసగా హర్రర్‌ కామెడీ సినిమాలు సక్సెస్‌ అవుతున్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్‌ అయినా కూడా ప్రేక్షకుల్లో హర్రర్‌ కామెడీ సినిమాలపై మోజు అలాగే ఉంది. అందుకే ప్రభాకర్‌ హర్రర్‌ కామెడీ జోనర్‌లో ఈ చిత్ర కథను సిద్దం చేశాడు.

Image result for allusirish

మొదట ఈ కథను అల్లు శిరీష్‌ కోసం అనుకోవడం జరిగింది. ఆయన్ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్‌ను సిద్దం చేసి అల్లు అరవింద్‌కు వినిపించాను, అల్లు అరవింద్‌గారు చిన్న చిన్న మార్పులు చెప్పిన తర్వాత బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. అయితే కొన్ని కారణాల వల్ల అల్లు శిరీష్‌ ఈ సినిమాను చేయలేక పోవడంతో ఆదితో చేశాను అంటూ దర్శకుడు ప్రభాకర్‌ చెప్పుకొచ్చాడు.

ప్రభాకర్‌ ఇప్పటి వరకు బుల్లి తెరపై పలు సూపర్‌ హిట్స్‌ సాధించాడు. బుల్లి తెరపై మెగాస్టార్‌గా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్రభాకర్‌ ఈ సినిమాతో సక్సెస్‌ అయితే వెండి తెరపై కూడా ప్రభాకర్‌ సండది మొదలవుతుంది. ఒక వేళ ఈ సినిమా మంచి విజయాన్ని సాధించినట్లయితే అల్లు శిరీష్‌ మంచి సినిమాను మిస్‌ అయినట్లుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అల్లు శిరీష్‌ కెరీర్‌ పీక్స్‌లో ఏమీ లేదు. అయినా కూడా అల్లు శిరీష్‌ ఈ సినిమాను చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే చిన్న హీరోలు మాత్రమే హర్రర్‌ కామెడీ నేపథ్యంలో సినిమాలు చేస్తారు అనేది ఆయన ఉద్దేశ్యం అయ్యి ఉంటుంది. అందుకే ఈ సినిమాను కాదనుకున్నాడు. నెక్ట్స్‌ నువ్వే సినిమా సక్సెస్‌ అయితే అల్లు శిరీష్‌ మంచి ప్రాజెక్ట్‌ను వదులుకున్నట్లు అవుతుంది. మరి సినిమా ఫలితం ఏంటి అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.