ఆర్ధిక కష్టాలు…కుటుంబాన్ని చంపి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్

Economical Problems..Doctor who commits suicide by killing family

ఆర్ధిక భారం ఎక్కువయ్యి కుటుంబ పోషణ కష్టం అవడంతో ఇక బతకడం అనవసరం అనుకున్న ఒక డాక్టర్‌ తన భార్య, ఇద్దరు పిల్లలను హతమార్చి, తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తర ప్రదేశ్ గుర్గావ్ లో చోటుచేసుకొంది. పోలీసులు వివరాల ప్రకారం వారణాసికు చెందిన ప్రకాష్ సింగ్ (55) తన భార్య సోను సింగ్ (50), కుమార్తె అదితి (22), కుమారుడు ఆదిత్య (13) నిద్రిస్తున్నప్పుడు వారి మీద దాడి చేసి హతమార్చాడు. ఆ తర్వాత తాను సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. ప్రకాష్ మినహా మిగతా కుటుంబ సభ్యులందరి గొంతును కత్తితో కోసిన గాయాలున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకొన్న సూసైడ్ నోట్‌లో కుటుంబ నిర్వహణ కష్టమైన కారణంగానే ప్రకాష్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఉంది. హైదరాబాద్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసిన ప్రకాష్‌ గత ఎనిమిదేళ్లుగా గుర్గావ్‌లోనివాసం ఉంటున్నాడు. అతని భార్య గుర్గావ్‌లో సొంత స్కూల్‌ను నడుపుతోంది. వీరికి ఆర్ధిక ఇబ్బందులు అంటే నమ్మసక్యంగా లేదని పోలీసులు అంటున్నారు.