30 రూపాయలు అడిగిందని విడాకులిచ్చేశాడు

Divorce because asked for thirty rupees

ఒక పక్క ట్రిపుల్‌ తలాక్‌ నేరమని కేంద్రం చట్టాలు తీసుకొచ్చి హెచ్చరిస్తున్నప్పటికి ఈ మూడ విశ్వాసం వలన బాధితుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తాజాగా నోయిడాలో మరో ట్రిపుల్‌ తలాక్‌ సంఘటన చేసుకుంది. కూరగాయలు కొనేందుకు 30 రూపాయలు అడిగిందని భార్యకు ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే నోయిడాకు చెందిన జైనాబ్‌‌(30) కూరగాయలు కొనడం కోసం భర్తతో పాటు స్థానిక రావోజి మార్కెట్‌కు వెళ్లింది. కురగాయలు కొనే నిమిత్తం రూ. 30 ఇవ్వాల్సిందిగా భర్తను కోరింది. దాంతో ఆగ్రహించిన ఆమె భర్త సబీర్‌(32) స్క్రూడ్రైవర్‌తో జైనాబ్‌ మీద దాడి చేయడమే కాక వెంటనే ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు. దీంతో జైనాబ్‌ తన తండ్రి వద్దకు వెళ్లి అతనితో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేసింది. దీంతో వారి మేరకు సబీర్‌, అతని కుటుంబ సభ్యుల మీద దాద్రీ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ సంఘటన గురించి బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘పెళ్లైన దగ్గర నుంచి సబీర్‌ తన కూతుర్ని హింసిస్తున్నాడని, అతని సోదరులు కూడా తన కుమార్తెతో తప్పుగా ప్రవర్తిస్తున్నారని, ఈ క్రమంలో గత వారం జైనాబ్‌ మా ఇంటికి వచ్చి, ఐదు రోజుల తర్వాత తన అత్త వారింటికి వెళ్లిందని, వెళ్లిన దగ్గర నుంచి సబీర్‌ తనకు విడాకులు కావాలంటూ నా కుమార్తెను వేధించడం ప్రారంభించాడని ఆయన పేర్కొన్నాడు. ఈ క్రమంలో కూరగాయల కోసం 30 రూపాయలు అడగడంతో సబీర్‌ తలాక్‌ చెప్పాడని ఆయన పేర్కొన్నారు.